Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ కడుపులో 570 రాళ్లు: షాక్ అయిన డాక్టర్లు

ఐవీఆర్
మంగళవారం, 21 మే 2024 (11:48 IST)
ఓ మహిళ కడుపులో 570 రాళ్లు వుండటం చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. అంబేద్కర్ కోనసీన జిల్లా అమలాపురం లోని దేవగుప్తంకి చెందిన నరసవేణి అనే మహిళ గత కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. సమస్య వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఎలాగో నొప్పిని భరిస్తూ వస్తోంది. ఐతే ఈ కడుపు నొప్పి మరింత తీవ్రమై తట్టుకోలేని స్థాయికి వెళ్లడంతో ఆమె అమలాపురంలోని ఏఎస్ఎ ఆసుపత్రికి వెళ్లి సమస్యను చెప్పింది. వైద్యులు పరీక్షించి ఆమె బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు.
 
వెంటనే ఆమెకి సర్జరీ చేయాలని నిర్ణయించారు వైద్యులు. శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో ఆమె కడుపులో వున్న రాళ్లను చూసి అంతా షాక్ తిన్నారు. రాళ్లు ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 570 రాళ్లు ఆమె కడుపు నుంచి బయటపడ్డాయి. సహజంగా ఇలాంటి కేసుల్లో పదుల సంఖ్యలో మాత్రమే రాళ్లు వుంటాయనీ, అలాంటిది ఆమె పొట్టలో వందల సంఖ్యలో రాళ్లు వుండటం ఆశ్చర్యానికి గురి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నట్లు వైద్యులు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments