డాక్టర్ వేధింపులు తాళలేక.. బాలివుడ్ నటి, మోడల్ శిఖ జోషి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 18 మే 2015 (06:27 IST)
తానో మోడల్, నటి. మరింత అందంగా ఉండడానికి ప్రయత్నించింది. ఇందుకోసం చిన్న చిన్న ప్లాస్టిక్ సర్జీలు చేయించుకోవడం సహజం. అయితే తనకు ప్లాస్టిక్ సర్జరీ చేసే ఓ డాక్టర్ తనను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. భరించలేక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన భయపడని డాక్టర్ కేసు విత్ డ్రా చేసుకోమని బెదిరించడం మొదలు పెట్టాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమె గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ముంబయిలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
మోడల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ముంబయిలోని ఓ ఆపార్ట్ మెంట్లో చోటుచేసుకుంది. పోలీసులు, ఆమె సోదరుడు విశేష్  చెబుతున్న  వివరాల ప్రకారం ఢిల్లీకి చెందిన శిఖ జోషి అనే మోడల్ బాలివుడ్ నటి కూడా. గత ఎనిమిదేళ్లుగా ముంబయిలో ఉంటోంది. గతంలో శిఖాకు కాస్మోటిక్ సర్జరీలు నిర్వహించే ఓ వైద్యుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, దీంతో ఆమె కేసు పెట్టిందని, ఆ కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా బెదిరింపులు, ఒత్తిడిలకు గురిచేశారు. దీంతో ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపాడు.
 
మూడు నెలల కిందటే మధు అనే తన స్నేహితురాలు ఇంటికి వెళ్లింది. కొంతకాలంగా తీవ్ర ఒత్తిడికి లోనైట్లు కనిపించిన శిఖా ఉన్నట్లుండి గొంతు కోసుకుని మధు బాత్ రూం వద్ద పడి ఉండటంతో మధు దంపతులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు

మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్‌ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య

శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Ebola : ఆఫ్రికాలో ఎబోలా-విజయవాడ ఎయిర్‌పోర్టులో పరీక్షా కేంద్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?