Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి ఆడియో విడుదలకు భారీ ఏర్పాట్లు... పర్యవేక్షించిన రాజమౌళి

Webdunia
శనివారం, 13 జూన్ 2015 (07:14 IST)
బాహుబలి చిత్రం ఆడియో విడుదలకు తిరుపతి వేదికగా మారింది. ఇక్కడున్న ఎస్వీయుకు చెందిన తారక రామస్టేడియంను అంగరంగవైభవంగా తీర్చిదిద్దారు. చిత్ర దర్శకుడు రాజమౌళి ఏర్పాట్లను పర్యవేక్షించారు. శుక్రవారమే తిరుపతి చేరుకున్న ఆయన ఉదయం నుంచే సినీ ప్రముఖుడు ఎన్వీ ప్రసాద్ తో కలసి స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
 
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి’. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ఆడియో వేడుక శనివారం తిరుపతిలో జరగనుంది. స్వాగత తోరణాలు, ఆడియో విధానం వంటివి ఇప్పటికే ఏర్పాటయ్యాయి. స్టేజీ, కుర్చీల ఏర్పాటు వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దర్శకుడు రాజమౌళి మైదానమంతా కలియతిరిగి అణువణువును పరిశీలించారు. 
 
ప్రభాస్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రంలో రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. కె.రాఘవేంద్రరావు బి.ఎ. సమర్పణలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి ఆడియో రైట్స్ ప్రముఖ లహరి సంస్థ దక్కించుకుంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం 'బాహుబలి- ద బిగినింగ్' పేరుతో విడుదల కానుంది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments