Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాత్ర 2 టీజర్ రివ్యూ ఎలా వుందంటే?

సెల్వి
శుక్రవారం, 5 జనవరి 2024 (17:54 IST)
Yatra 2
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న యాత్ర 2 టీజర్‌ శుక్రవారం విడుదలైంది. జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యాత్ర 2. 
 
యాత్ర 2 చిత్రంలో వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా కనిపించబోతున్నాడు. మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు. యాత్ర 2 చిత్రానికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాత్ర 2 టీజర్ ఘాటుగా, ఎమోషనల్‌గా ఉంది. 
 
జగన్ జీవితంలో జరిగిన సంఘటనలను టీజర్‌లో వాస్తవికంగా చూపించారు. అంధుడు జగన్ కోసం వెయిట్ చేయడంతో టీజర్ స్టార్ట్ అవుతుంది. టీజర్‌ ప్రారంభంలోని డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. జగన్‌ను అవినీతిపరుడిగా నిరూపించేందుకు చేస్తున్న కుట్రలను టీజర్‌లో చూపించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. 
 
లక్ష కోట్లా లక్ష కోట్లు లక్షన్నర సార్లు డైలాగ్ ఆసక్తికరంగా ఉంటుంది. టీజర్ చివర్లో తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిని అంటూ జీవా చెప్పిన డైలాగ్ హైలైట్. టీజర్ చివర్లో మమ్ముట్టి కనిపించారు. యాత్ర 2 టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
2009 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ సంఘటనల ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ పొలిటికల్ బయోపిక్‌లో నారా చంద్రబాబు నాయుడుగా బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీగా సుజానే బెర్నెర్ట్ మరియు కేతకి నారాయణన్ నటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

Father: కన్నతండ్రే కూతురిపై అత్యాచారయత్నం.. తాగిన మైకంలో శరీర భాగాలు తాకుతూ?

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments