Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లుడిని ఆశీర్వదించిన 'వకీల్ సాబ్' ... ఉబ్బితబ్బిబ్బులైన చిత్ర యూనిట్

Webdunia
గురువారం, 12 మార్చి 2020 (14:51 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో నటిస్తూ తెగబిజీగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఒక సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం అంటే మామూలు విషయం కాదు. కానీ, మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్ కొత్త చిత్రం గురువారం హైదరాబాద్ నగరంలో ప్రారంభమైంది. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ఈ వకీల్ సాబ్ ముఖ్యఅతిథిగా వచ్చి క్లాప్ కొట్టి, హీరోహీరోయిన్లను ఆశీర్వదించి వెళ్లారు.
 
దీనిపై హీరో సాయిధరమ్ తేజా ట్వీట్ చేశారు. 'ఈ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఏ పదాలూ సరిపోవట్లేవు. థ్యాంక్యూ సో మచ్‌ పవన్ కల్యాణ్‌ మామా..' అని పేర్కొన్నారు. దేవర కట్టా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాకు పవన్‌ క్లాప్‌ కొట్టారని, అందరి ఆశీర్వాదాలు కావాలని ఆయన కోరాడు.  
 
దేవర కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్‌ తేజ్‌ ఈ సినిమాలో నటిస్తున్నారు. రాజకీయ కథాంశం నేపథ్యంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments