Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త రికార్డు దిశగా 'రంగస్థలం' .. చిరంజీవి రికార్డు బ్రేక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కె.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌కాగా, జగపతిబాబు, ఆది పిని

Webdunia
సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:37 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం "రంగస్థలం". ఈ చిత్రం గత నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కె.సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌కాగా, జగపతిబాబు, ఆది పినిశెట్టి, ప్రకాష్ రాజ్, అనసూయ, పూజా హెగ్డే తదితరులు నటించారు.
 
అయితే, ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసింది. ఈ సినిమా హిట్‌తో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తొలి వారంలో ఈ సినిమా రూ.128 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. 10 రోజులు పూర్తయ్యేనాటికి ఈ సినిమా రూ.147.10 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఇంతకుముందు రూ.144.55 కోట్లను వసూలు చేసి రికార్డును సెట్ చేసిన 'శ్రీమంతుడు'ను అధిగమించింది.
 
దీంతో రంగస్థలం రూ.150 కోట్ల క్లబ్‌లో చేరేందుకు మరెన్నో రోజులు పట్టదని ఫిల్మ్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం, 'బాహుబలి'ని పక్కన పెడితే, ప్రపంచవ్యాప్తంగా 'మగధీర' రూ.150 కోట్లను.. 'ఖైదీ నంబర్ 150' రూ.164 కోట్లను వసూలు చేసి రికార్డులు సృష్టించాయి. ఇపుడు ఈ రంగస్థలం మున్ముందు ఈ రెండు చిత్రాల రికార్డులను చెరివేసే దిశగా దూసుకెళుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments