Webdunia - Bharat's app for daily news and videos

Install App

2.0 కోసం శంక‌ర్ అన్నిసార్లు క‌థ మార్చాడా..? ఆయన అతిజాగ్రత్త ఏం చేస్తుందో?

Webdunia
సోమవారం, 5 నవంబరు 2018 (20:00 IST)
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్టర్ శంక‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ 2.0. భార‌త‌దేశంలో అత్యంత భారీ బ‌డ్జెట్ 600 కోట్ల‌తో రూపొందిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేసారు. హాలీవుడ్ మూవీని చూసిన ఫీల్ క‌లిగిస్తోన్న ఈ ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేసింది. ఈ సినిమా నాలుగు సంవ‌త్స‌రాల పాటు సెట్స్ పైన ఉంది. అయినా... ఈ సినిమాపై క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. చాలా రీషూట్లు చేసాడు శంక‌ర్. బ‌డ్జెట్ 600 కోట్లు అవ్వ‌డానికి ఇదే ప్ర‌ధాన కార‌ణం. 
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ క‌థ‌ని శంక‌ర్ మూడుసార్లు మార్చాడ‌ట. దీంతో రీషూట్ల మీద రీషూట్లు చేసుకుంటూ వెళ్లాల్సి వ‌చ్చింది. రెహ‌మాన్ కూడా ఈ సినిమా కోసం మూడుసార్లు రీ-రికార్డింగ్ కూడా మార్చాల్సివ‌చ్చింది. అంటే.. ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిన త‌ర్వాత కొత్త సీన్ రాసార‌న్న‌మాట‌. నాలుగేళ్లుగా క‌థ‌లో మార్పులు చేస్తూనే ఉన్నార‌న్న‌మాట‌. శంక‌ర్ గ‌త చిత్రం ఐ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో 2.0 సినిమాపై మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు. మ‌రి.. ఈ అతి జాగ్ర‌త్త ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments