Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా సినిమా బయటకు వస్తుందో రాదో ఎవడికి తెలుసు? తన చిత్రంపై వినాయక్ సెటైర్

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (20:07 IST)
మాస్ సినిమా అనగానే... ఈ కాలంలో గుర్తుకువచ్చే డైరెక్టర్ వి.వి.వినాయక్. అభిరుచి గల నిర్మాత రాజును దిల్ సినిమాతో దిల్ రాజు చేసేసారు. అప్పటి నుంచి నిర్మాత దిల్ రాజు - దర్శకుడు వినాయక్ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే... ఎందుకు అనిపించిందో ఏమో కానీ... వినాయక్‌ని హీరోగా పెట్టి సినిమా తీయాలనిపించింది దిల్ రాజుకు.
 
అంతే... వినాయక్‌కి ఓ రోజు ఈ విషయం చెప్పడం... వినాయక్ కూడా ఓకే అనడం జరిగింది. అంతేనా... శీనయ్య అనే టైటిల్‌తో సినిమాని గ్రాండ్‌గా స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే వీళ్లు ఎంత ఫాస్ట్‌గా ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొచ్చారో అంతే ఫాస్ట్‌గా అది సైడ్ ట్రాక్ లోకి కూడా వెళ్లిపోయింది. ఎందుకు ఈ ప్రాజెక్ట్ సైడ్‌కి వెళ్లిపోయిందంటే... అనేక కారణాలు.
 
కథ సరిగా లేదని.. డైరెక్టర్ చెప్పింది వినాయక్‌కి నచ్చడం లేదని... ఇప్పటి వరకు షూట్ చేసిన రష్ చూసుకుంటే సరిగా రాలేదని... ఇలా చాలా కారణాలు వున్నాయి కానీ... అసలు ఈ సినిమా ఉందా..? లేదా..? అనేది మాత్రం అఫిషియల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాలేదు. అయితే.. క్లారిటీ లేని ఈ సినిమా గురించి శీనయ్య అదేనండి వినాయక్ స్పందించాడు.
 
ఇంతకీ ఏమన్నాడంటే... శీనయ్య సినిమా వస్తుందా అని అడిగితే... ఏమో ఎవడికి తెలుసంటూ సెటైరిక్‌గా సమాధానమిచ్చాడు వినాయక్. తను కేవలం బరువు తగ్గడం కోసమే ఆ సినిమా ఒప్పుకున్నానని.. తనకు మాత్రం తృప్తిగా ఉందన్నాడు. ఈ విధంగా శీనయ్య సినిమా రాదనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు.

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments