Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంజయ్ దత్‌కు రూ.72 కోట్ల ఆస్తి రాసిచ్చిన మహిళా వీరాభిమాని!!

ఠాగూర్
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (16:43 IST)
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు ఓ మహిళా వీరాభిమాని రూ.72 కోట్ల విలువ చేసే ఆస్తిని రాసిచ్చింది. ఆ మహిళా వీరాభిమాని పేరు నిషా పాటిల్ (62). ఇటీవలే ఆమె చనిపోయారు. 2018లోనే సంజయ్ దత్ పేరిట వీలునామా రాయించింది. అయితే, ఆ ఆస్తిని బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఆస్తిని స్వీకరించేందుకు నిరాకరించారు. అయితే, ఆ అభిమాని ప్రేమకు ఈ ఖల్‌ నాయక్ చలించిపోయాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన నిషా పాటిల్‌కు బావీవుడ్ హీరో సంజయ్ దత్ విపరీతమైన అభిమానం. తొలి నుంచి కూడా ఆయనను అభిమానిస్తుంది. ఆయన ప్రతి సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసింది. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఆమె వయసు 62 యేళ్లు. కాగా, ఆమె పేరిట దాదాపు రూ.72 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. 
 
తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయని విషయాన్ని గ్రహించిన నిషా పటేల్.. 2018లోనే తన ఆస్తి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు సంజయ్ దత్‌కు చెందేలా వీలునామా రాయించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె వీలునామా దస్తావేజులు సంజయ్ దత్‌ ఇంటికి వచ్చారు. విషయం తెలిసిన సంజయ్ దత్‌ షాక్ గురయ్యారు. పరిచయం లేని వ్యక్తి ఆస్తి రాసివ్వడం చూసి చలించిపోయారు. 
 
అయితే, ఆ ఆస్తిని సంజయ్ దత్ తీసుకోలేదు. ఆ ఆస్తి తిరిగి ఆమె కుటుంబానికి చెందేలా చూడాలని తన లీగల్ టీమ్‌కు సూచించారు. ఇంత గొప్ప అభిమానిని కలవలేకపోవడం బాధగా ఉందని చెప్పారు. కనీసం ఆమె కుటుంబ సభ్యులైనా కలిసి కొంత ఊరట చెందుతానని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలా?

ఉపాధ్యాయురాలి తలపై నుంచి వెళ్లిన లారీ...

వైకాపా మాజీ మంత్రికి అరెస్టు భయం... ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్: బీర్ల ధరలు పెంపు

పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ తినేందుకు రూ. 50 భోజనం, అంతేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments