Webdunia - Bharat's app for daily news and videos

Install App

పత్తాలేకుండాపోయిన కేతిరెడ్డి... ఫ్రీపబ్లిసిటీ కోసమేనా?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (18:30 IST)
టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్" తీస్తున్నానని ప్రకటించినప్పుడు దానికి పోటీగా "లక్ష్మీస్ వీరగ్రంథం" తీస్తానని ప్రకటించి వార్తల్లో నిలిచి హడావుడి చేసిన దర్శక నిర్మాత కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఆ తర్వాత ఈయన పత్తాలేకుండాపోయారు. సినిమా గురించి ఊసెత్తలేదు.

లక్ష్మీ పార్వతి పాత్రలో శ్రీరెడ్డిని ఉంచబోతున్నట్లు ప్రకటించారు. టీజర్లు, పోస్టర్లు అంటూ కొన్నాళ్లు హంగామా చేశారు. అయితే చూడబోతుంటే అసలు ఈ సినిమాని ప్రారంభించారా? అనే సందేహం వస్తోంది. దానికితోడు మరో సినిమా అనౌన్స్ చేశాడు. అదే శశిలలిత. వర్మ శశికళ చేస్తానని చెప్పిన కొద్దిరోజులకే ఈయన ఇప్పుడు ఈ ప్రస్తావన తెచ్చారు. 
 
ఇదంతా చూస్తుంటే వీళ్లు సినిమా చేయాలనుకుంటున్నారా? లేక ఫ్రీపబ్లిసిటీ కోసం ఉవ్విళ్లూరుతున్నారా? అనిపిస్తోంది. అసలు మన హీరోల బయోపిక్కులే జనం చూడటం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ప్రభావం చూసి దర్శక నిర్మాతలు ఎవరూ ఇలాంటివి తీయడానికి ముందుకు రావడం లేదు.

అలాంటిది మన మాజీ నటి, పక్క రాష్ట్ర సీఎం, ఆమె స్నేహితురాలు శశికళ బయోపిక్‌లు తీస్తే ఎవరు చూస్తారు. ఏదో ఒక వివాదం రేపి వర్మ పబ్లిసిటీ చేసుకుంటుంటాడు. అలా అందరికీ జరగదు. కాబట్టే కేతిరెడ్డి ప్రకటనలు చూస్తుంటే కామెడీగా ఉందని ఫిలిం నగర్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments