Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ అన్నమాటల్లో తప్పేమిటి? మీడియాకు హరీశ్ శంకర్ సూటిప్రశ్న

డీవీ
మంగళవారం, 13 ఆగస్టు 2024 (16:56 IST)
Harish Shankar
ఇటీవల మంత్రి హోదాలో అటవీశాఖకు సంబంధించిన ఎర్రచందనం విషయంలో సినిమాలలో ఎర్రచందనం చెట్లను నరకడమే హీరోయిజమా? అంటూ ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ అన్న మాటలు కొంతమందిని హర్ట్ చేశాయి. ఇది కేవలం అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గురించే అంటూ రకరకాలుగా వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని నేడు హరీశ్ శంకర్ ను విలేకరులు కలిసినప్పుడు దర్శకులు చూపే హీరోలు విలనిజం చేసినా హీరోయిజంగా చూపిస్తున్నారు. దీనిపై ఇటీవలే పవన్ కళ్యాణ్ మాటలు వైరల్ అయ్యాయి? దీనికి మీ సమాధానం ఏమిటని అడిగారు. 
 
అందుకు స్పందించిన హరీశ్ శంకర్, సినిమా అనేది కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే. పవన్ కళ్యాన్ గారు స్వతహాగా పర్యావరణ రక్షకుడు. ఆయన తగిన మంత్రిపదవి దక్కింది.  తను ఓ సందర్భంలో సందర్భానుసారంగా మాట్లాడివుంటారు. అందులో తప్పేముంది? పుష్పలో చూపించినవిధంగా అందరూ గొడ్డళ్ళు పట్టుకుని అడవులకు వెళ్ళరు గదా. అపరిచితుడు, జాకీజాన్ సినిమాలలో హీరోలు చేసే పనులు ప్రేక్షకుడు చేయడు గదా? ఎవరి అభీష్టం మేరకు వారు ఆయా రంగాల్లో స్థిరపడతారు. ఏ సినిమా అయినా అది పాత్రమేరకే మనం చూడాలి. కథ రాసిన దర్శకుడు కోణం వేరుగా వుంటుంది. సినిమాలో చూపించినట్లుగా అన్ని జరిగితే దేశం మరో లెవల్లో వుంటుంది. సినిమా అనేది కొంతటైం మేరకు ఎఫెక్ట్ వుంటుంది. ఆ తర్వాత దాన్ని గురించి మర్చిపోతారు. దాన్ని పెద్ద కోణంలో సోషల్ మీడియా ఆలోచించి రకరకాల కథనాలు రాస్తూ మంచి ఉద్దేశ్యంతో అన్న మాటలు కూడా తప్పుదోవ పట్టించడం సమంజసం కాదని తన అభిప్రాయమని వెల్లడించారు. 
 
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ ఆగస్టు 14న రాత్రి విడుదలకాబోతోంది. నాట్ ఆగస్టు 15 అంటూ లాజికల్ క్లారిటీ కూడా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: దీపావళి రోజున కొత్త పార్టీ ప్రకటన చేయనున్న కల్వకుంట్ల కవిత.. రెండు పేర్లు సిద్ధం..?

Ranya Rao: కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్- రూ.102.55 కోట్ల జరిమానా విధించిన డీఆర్ఐ

Kothagudem: తాగొద్దయ్యా అంటే భార్యను చంపేసిన భర్త.. పోలీసుల ముందు లొంగిపోయాడు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని.. లైంగికంగా వాడుకున్నాడు.. 20 ఏళ్ల జైలుశిక్ష

No pay no work: జీతం లేనిదే పని చేసేది లేదు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments