Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైనపు బొమ్మా? కాజల్ అగర్వాలా? ఎవరు నిజం?

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (15:40 IST)
కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ
హీరోయిన్లకు ఆలయాలు కట్టడం మామూలే. గతంలో ఖుష్బూకు తమిళనాడులో ఆలయాలు కట్టారు. మరికొందరికీ ఆలయాలను కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. అయితే తాజాగా ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు మైనపు బొమ్మతో విగ్రహాన్ని ఏర్పాటు చేసేశారు. అచ్చం కాజల్‌లా ఉన్న ఈ విగ్రహం పక్కన నిల్చుని అమ్మడు ఫోటోలకు ఫోజులిచ్చింది.
 
ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరోయిన్ కాజల్ మైనపు విగ్రహాన్ని లాంచ్ చేశారు. సింగపూర్‌లో గల మ్యూజియంలో ఏర్పాటు చేసిన తన మైనపు విగ్రహం పక్కన ఫోజిస్తూ నవ్వులు చిందించింది కాజల్. టాలీవుడ్ నుండి ఈ అర్హత సాధించిన హీరోయిన్‌గా కాజల్ గుర్తింపు సంపాదించుకుంది. ఇక తెలుగు హీరోలలో ప్రభాస్, మహేష్ ఈ అర్హత సాధించారు. 
కాజల్ అగర్వాల్
బాలీవుడ్ నుండి అమితాబ్, హృతిక్, కాజోల్, ఐశ్వర్యా రాయ్, షారుక్, కరీనా కపూర్, అనిల్ కపూర్ ఇలా చాలామంది సెలెబ్రిటీల మైనపు విగ్రహాలు ఈ మ్యూజియం నందు ఏర్పాటు చేశారు కూడా. ఇక ప్రస్తుతం కాజల్ తెలుగులో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే దర్శకుడు శంకర్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌తో చేస్తున్న భారతీయుడు 2 సినిమాలో ప్రధాన హీరోయిన్‌గా చేస్తున్నారు. అవకాశాలు తగ్గినా సరే కాజల్‌కు మాత్రం అభిమానుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments