Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డికి ధైర్యం కావాలి.. నాకైతే అలాంటి అనుభవం లేదు: విశ్వరూపం ఆండ్రియా

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇప్పటివరకు టాలీవుడ్ మీద ఆరోపణలు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ మీద పడింది. కోలీవుడ్‌లో ప్రముఖులు మురుగదాస్, రాఘవ లారెన్స్, సుందర్ సి, శ్రీకాంత్‌లపై విరుచుకుపడింది. ప్రస్తుతం ఛాన

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (13:24 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇప్పటివరకు టాలీవుడ్ మీద ఆరోపణలు చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ మీద పడింది. కోలీవుడ్‌లో ప్రముఖులు మురుగదాస్, రాఘవ లారెన్స్, సుందర్ సి, శ్రీకాంత్‌లపై విరుచుకుపడింది. ప్రస్తుతం ఛానెళ్లకు, యూట్యూబ్‌లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా శ్రీరెడ్డి ఆరోపణలపై నటి, గాయని ఆండ్రియా స్పందించింది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఎంతో ధైర్యం అవసరమని ఆండ్రియా చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి వివాదాల గురించి తనను ప్రశ్నిస్తూ ఉంటారని... ఆమె చెబుతున్న వాటిలో నిజం ఉంటే, వాటిని బహిరంగపరచడానికి ఆమెకు ఎంతో ధైర్యం కావాలని చెప్పింది.

ఎవరికైనా అలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు, వాటిని కచ్చితంగా బయటపెట్టాలని సూచించింది. ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పింది. తనకైతే ఇంతవరకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని వెల్లడించింది. మహిళల బలహీనతలను అడ్డం పెట్టుకొని లైంగిక వేధింపులకు పాల్పడటం సరికాదు అని అండ్రియా చెప్పుకొచ్చింది.
 
తాజాగా లోకనాయకుడు కమలహాసన్ సరసన ఆండ్రియా నటించిన 'విశ్వరూపం-2' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఈ చిత్రంలో నటించిన తరువాత తనలో సామాజిక బాధ్యత ఎక్కువైందని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం