Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇళయరాజాకు సన్మానం.. సంగీత విభావరిలో ఎస్పీ.. ఇద్దరినీ కలిపితీరుతా: విశాల్

అంతర్జాతీయ వేదికల మీద తన పాటలు పడేందుకు తప్పనిసరిగా తన అనుమతి ఉండాల్సిందేనని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు.. మరో సంగీత దర్శకుడు, గాయకుడు ఇళయరాజా నోటీసులు పంపడం.. ప్రస్తుతం మ్యూజిక్ ఇండస్ట్రీలో

Webdunia
గురువారం, 23 మార్చి 2017 (10:10 IST)
అంతర్జాతీయ వేదికల మీద తన పాటలు పడేందుకు తప్పనిసరిగా తన అనుమతి ఉండాల్సిందేనని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు.. మరో సంగీత దర్శకుడు, గాయకుడు ఇళయరాజా నోటీసులు పంపడం.. ప్రస్తుతం మ్యూజిక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్‌ ప్రకటించారు. 
 
తమిళ సినీరంగం తరఫున ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానసభను నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతున్నట్టు విశాల్ చెప్పారు. సన్మానసభ సందర్భంగా ఇళయరాజా నిర్వహించే సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొంటారని ప్రకటించారు.
 
ఎస్పీ-రాజాల మధ్య మనస్పర్థలు తీవ్రమైన తరుణంలో విశాల్‌ ఆ ఇరువురు ఒకేవేదికపై సంగీత విభావరిలో పాల్గొంటారని ప్రకటించారు. ఈ విషయంపై ఇప్పటికే ఇద్దరితో మాట్లాడినట్లు విశాల్ తెలిపారు. నిర్మాతల సంఘం ఎన్నికలు ముగిసిన తర్వాత ఇళయరాజాకు సన్మానసభ జరుపుతామని విశాల్‌ తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments