Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ - జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ

డీవీ
శనివారం, 14 సెప్టెంబరు 2024 (17:09 IST)
Shivaji, Indraja, Ram Prasad, Hyper Aadi and others
బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లు చేయాలంటే అది ఈటీవీనే.. అందులోనూ మల్లెమాల సంస్థనే ముందుంటుంది. తాజాగా వినాయక చవితికి సంబంధించి జై జై గణేశా అనే ఈవెంట్‌ను చేశారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈ కార్యక్రమాన్ని నేటి ఉదయం 9 గంటలకు ప్రసారం చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ అన్నట్టుగా సాగింది. ఈ ఈవెంట్‌లో ఇంద్రజ, కుష్బూలు సందడి చేశారు.
 
వినాయక చవితి ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా హీరో, నటుడు శివాజీ మెరిశాడు. ఇకపై తాను షోకు జడ్జ్‌కు వస్తానని చెప్పాడు. జబర్దస్త్ షోకి జడ్జ్‌గా వస్తారా? శ్రీదేవీ డ్రామా కంపెనీకి జడ్జ్‌గా వస్తారా? అన్నది చెప్పకుండా కుష్బూ, ఇంద్రజలను ఆట పట్టించారు శివాజీ. ఇక ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్టులు, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులు పోటాపోటీగా స్కిట్లు చేశారు. ఇరు టీం సభ్యులు తమ తమ స్కిట్లతో అందరినీ అలరించారు.
 
రాం ప్రసాద్, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్‌ల స్కిట్లు అందరినీ నవ్వించాయి. మధ్యలో కుష్బూ, ఇంద్రజల పంచ్‌లు, శివాజీ సెటైర్లతో ఈవెంట్‌ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. వినాయక చవితి స్పెషల్‌గా చేసిన ఈ ఈవెంట్ బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments