ఆ ఇద్దరితో సినిమా చేయాలని వుంది: వినాయక్

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (22:28 IST)
డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్... అఖిల్‌తో చేసిన మూవీ సక్సెస్ సాధించకపోవడంతో కెరీర్లో కాస్త స్లో అయినట్టు అనిపించారు. అయితే... ఇటీవల మెగా ఫోన్ పక్కన పెట్టి శీనయ్య అనే సినిమాలో మెయిన్ లీడ్లో నటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. బ్లాక్‌బస్టర్ మూవీస్ తీయాల్సిన వినాయక్ ఇలా యాక్టర్ అవ్వడం ఏంటి అనుకున్నారు కొంతమంది సినీ ప్రముఖులు.
 
ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకపోవడంతో మళ్లీ డైరెక్షన్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. చిరంజీవితో లూసీఫర్ రీమేక్ చేయనున్నారు.
 
ఇదిలా ఉంటే... ఇటీవల వినాయక్ తన మనసులో మాటలను బయటపెట్టారు. స్టార్ హీరోల్లో దాదాపు అందరు అగ్ర హీరోలతో సినిమాలు చేసాను కానీ.. ఆ ఇద్దరితో సినిమాలు చేయలేదు. వాళ్లిద్దరితో సినిమా చేయాలనేది నా కోరిక అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.
 
ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే... ఒకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇంకొకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. వాళ్లతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటున్నానని, కానీ ఆ టైమ్ వచ్చినప్పుడు సినిమా సెట్ అవుతుందని వినాయక్ నమ్మకంగా ఉన్నారు. 
 
అలాగే అఖిల్ సినిమా తర్వాత తనలో టాలెంట్ తగ్గిందంటూ వస్తున్న విమర్శల్ని కొట్టిపారేస్తున్నారు. ప్రతి మనిషికి గుడ్ టైమ్ బ్యాడ్ టైమ్ ఉంటుంది. బ్యాడ్ టైమ్ వచ్చినప్పుడు దానిని దాటుకుని వెళ్లడమే అంటూ తనకి మంచి టైమ్ వస్తుందని చెప్పకనే చెప్పారు. మరి.. పవన్, మహేష్‌ బాబులతో సినిమా చేయాలనే ఆయన కోరిక నెరవేరుతుందని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

వివాహేతర సంబంధం: ప్రియురాలు పరిచయం చేసిన మహిళతో ప్రియుడు కనెక్ట్, అంతే...

మోహన్ బాబు యూనివర్శిటీ గుర్తింపు రద్దా? మంచు విష్ణు ప్రకటన

Mohanbabu: మోహన్ బాబు యూనివర్శిటీ లోని అభియోగాలపై ప్రో-ఛాన్సలర్ ప్రకటన

కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీకేంద్రంలో పేలుడు: ఆరుగురు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments