ఎల్లప్పుడూ ప్రేమతో మీ రౌడీ.. ఇలా మారండి.. విజయ్ దేవరకొండ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆన్‌లైన్ వేదికగా దుర్భాషలొద్దని వార్నింగ్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ కథ

Webdunia
బుధవారం, 3 అక్టోబరు 2018 (16:00 IST)
అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆన్‌లైన్ వేదికగా దుర్భాషలొద్దని వార్నింగ్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ''నోటా'' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో యువకులకు ఆయనో ట్వీట్ చేశారు. తద్వారా సందేశాన్నిచ్చారు. సొంత, నియమ, నిబంధనలను ఏర్పాటు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. యువకులమైన మనం మార్పునకు నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. 
 
మార్పు అనేది సినిమాల్లో కావొచ్చు. జీవనశైలిలో కావొచ్చునన్నారు. మన రౌడీ కల్చర్ లేదా, మన యాటిట్యూడ్‌కు సంబంధించిన మార్పు ఏదైనా కావొచ్చు. సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా సానుకూల దృక్పథాన్ని మనం ట్రెండింగ్‌ చేయాల్సిన సమయం ఇదని గుర్తు చేశారు. తనపై అభిమానంతో చాలామంది తన ఫోటోను డిస్‌ప్లే పిక్చర్‌గా పెట్టుకున్నారు. 
 
కానీ మీలో చాలామంది కయ్యానికి కాలు దువ్వేలా వున్నారు. అలా తానెప్పటికీ చేయకు. దయచేసి మీరు అలా చేయకండి.. కొందరి మాటలు బాధ కలిగించవచ్చు. అందుకే ఆలోచించి మాట్లాడాలి. బతుకుదాం.. బతకనిద్దాం.. అంటూ అర్జున్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.  
 
అలాగే విజయ్ దేవరకొండ.. యువకులకు సందేశం ఇచ్చారు. మనం చేయాల్సిందంతా సంతోషంగా ముందడుగు వేయాల్సిందే. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకూడదని.. ఆన్‌లైన్‌ వేదికగా దుర్భాషలాడటం మాత్రం చూడాలనుకోవడం లేదని చెప్పారు. ఎల్లప్పుడూ ప్రేమతో మీ రౌడీ అంటూ అర్జున్ రెడ్డి తన ట్వీట్‌ను ముగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments