పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టు ఇదే

Webdunia
మంగళవారం, 29 మార్చి 2022 (16:32 IST)
సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సరికొత్త ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. "జనగణమన" (జేజీఎం) అనే టైటిల్‌తో ఈ సినిమా ఓపెనింగ్ మంగళవారం ప్రారంభమైంది. పూరీ కనెక్స్ట్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మాణం జరుపుకోనుంది. ముంబైలో ఈ చిత్రం ప్రారంభం కోసం హీరో విజయ్ దేవరకొండ హెలికాఫ్టర్‌లో రాగా అప్పటికే అక్కడ సిద్ధంగా ఉ్న ఆర్మీ కమాండ్ వాహనంలో ఎక్కి అందరికీ అభివాదం చేశాడు. 
 
ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండతో పాటు పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, వంశీ పైడిపల్లి, తదితరులు పాల్గొన్నారు. నిజానికి 'జనగణమన' చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీయాలని భావించారు. కానీ, అది సాధ్యపడకపోవడంతో ఇపుడు విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నారు.
 
ఈ పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. వచ్చే యేడాది ఆగస్టు 3వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

రెండు రోజుల్లో పెళ్లి.. ఫైనాన్షియర్ల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments