Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

ఠాగూర్
గురువారం, 20 మార్చి 2025 (17:33 IST)
బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసిన సినీ సెలెబ్రిటీలపై తెలంగాణ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే అనేక సినీ సెలెబ్రిటీలు, యాంకర్లపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు విజయ్ దేవరకొండ, రానా, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత వంటి వారు కూడా పలు బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేశారు.
 
ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ టీం వివరణ ఇచ్చింది. చట్టబద్ధమైన అనుమతులు ఉన్న గేమ్స్‌కే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని పేర్కొంది. అది కూడా స్కిల్ బేస్డ్ గేమ్స్‌కే అని పేర్కొంది. 
 
అనుమతి ఉన్న ఏ23 అనే సంస్థ తరపున విజయ్ దేవరకొండ పనిచేశారని వివరించింది. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిందని వెల్లడించింది. ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండ ఒప్పందం గత యేడాదినే ముగిసిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం ఏ23 సంస్థతో విజయ్ దేవరకొండకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments