Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిగ్గజ సినీ దర్శకుడు తాతినేని రామారావు ఇకలేరు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (07:23 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన దిగ్గజ సినీ దర్శకుడు తాతినేని రామారావు ఇకలేరు. ఆయన వయసు 84 యేళ్లు. తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన్ను చెన్నై పోరూరులోని శ్రీరామచంద్ర ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, బుధవారం కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
తెలుగు, హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగులో అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ వంటి హీరోల చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే, అమితాబ్, రజనీకాంత్, ధర్మేంద్రం, రాజేష్ ఖన్నా, గోవిందా, అనిల్ కపూర్ సంజయ్ దత్ వంటి అగ్ర నటులతో ఆయన సినిమాలు చేశారు. 
 
ఎన్టీఆర్ ఆయన తీసిన "యమగోల", కృష్ణతో "పచ్చని సంసారం", శోభన్ బాబుతో "జీవనతరంగాలు" మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈయనకు భార్య తాతినేని జయశ్రీ, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో బుధవారం జరుగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments