Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

డీవీ
మంగళవారం, 24 డిశెంబరు 2024 (06:22 IST)
Snkranthi song
విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి రెండు పాటలకు చార్ట్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగల్ గోదారి గట్టు గ్లోబల్ టాప్ 20 వీడియోస్ లిస్టు లో ప్రవేశించగా, సెకండ్ సింగిల్ మీను కూడా అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది.
 
మేకర్స్ సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్ మేకర్స్ ప్రారంభించారు. భీమ్స్ సిసిరోలియో సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ ని హైలైట్ చేసే మరో అద్భుతమైన నెంబర్ ని కంపోజ్ చేశారు. ఆర్‌ఎఫ్‌సీలో వేసిన వైబ్రైంట్ సెట్ లో హీరో వెంకటేష్, హీరోయిన్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ పై ఈ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. పోస్టర్‌లో వెంకటేష్ ఐశ్వర్య, మీనాక్షి , ఇతరులతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇక్కడ అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు.
 
ఈ ఎనర్జిటిక్, కలర్‌ఫుల్ నంబర్ కు భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ సినిమా మెయిన్ హైలైట్‌లలో ఒకటిగా ఉంటుంది. 
 
వెంకటేష్ ఎక్స్ పోలీస్ పాత్రలో, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి ఎక్స్ లవర్ గా కనిపించనున్నారు.  
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి నిర్వహిస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments