Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్‌కు అనుమతి నిరాకరణ.. మారిన వేదిక

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (17:23 IST)
హీరో బాలకృష్ణ నటించిన కొత్త చిత్రం "వీరసింహారెడ్డి". సంక్రాంతికి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ శుక్రవారం ప్రీరిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని చిత్ర నిర్మాతలు భావించారు. ఇందులోభాగంగా తొలుత ఒంగోలులోని ఏబీఎం కాలేజీ మైదానంలో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. 
 
కానీ, సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని సాకుగా చూపి అక్కడ అనుమతి రద్దు చేశారు. దీంతో నిర్మాతలు మరో వేదికను ఎంపిక చేశారు. ఒంగోలు మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌‌లో ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 
 
ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టరును రిలీజ్ చేశారు. ఒంగోలులోని ఈ ప్రదేశఁలో ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు నుంచి ఈ వేడుక మొదలుకానుంది. కాగా, ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటించారు. థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

Hyderabad: కారును ఢీకొన్న వ్యాన్.. నుజ్జు నుజ్జు.. ముగ్గురు మృతి

మహిళతో సహజీవనం... కుమార్తెనిచ్చి పెళ్లి చేయాలంటూ వేధింపులు...

ఎవరైనా కొడితే కొట్టించుకోండి.. ఆ తర్వాత తుక్కు రేగ్గొట్టి సినిమా చూపిద్దాం : కేడర్‌కు జగన్ సూచన

Kurnool: జూలై 2 నుంచి కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments