Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్‌పై 'మట్కా' ప్రమోషన్ బాధ్యతలు - శ్రీవారి సేవలో పాల్గొన్న యూనిట్

ఠాగూర్
బుధవారం, 13 నవంబరు 2024 (18:07 IST)
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం "మట్కా". ఈ నెల 14వ తేదీన విడుదలకానుంది. అయితే, ఈ చిత్రం ప్రమోషన్ కోసం వరుణ్ తేజ్ స్వయంగా రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం చేశారు. హిందీ వెర్షన్ ప్రమోషన్స్ కొసం‌ ముంబై కూడా వెళ్లారు. ఈ సినిమాకు థియేటర్స్ కూడా భారీగా కేటాయించారు. కానీ 'మట్కా'కు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సరైన రెస్పాన్స్ కనిపించటం లేదు.
 
వరుణ్ గత చిత్రాల ఎఫెక్ట్ 'మట్కా' బుకింగ్స్‌పై పడింది. హైదరాబాద్ నగరంలో సైతం అడ్వాన్స్ బుకింగ్స్ 10 శాతం లోపే ఉంది‌. ఆన్‌లైన్‌లో స్క్రీన్స్ అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 'మట్కా'‌కు మౌత్ టాక్ పాజిటివ్‌గా రావాల్సి ఉంది. లేదంటే షోస్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన విషయం తెల్సిందే. మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ చిత్రానికి కె.అరుణ కుమార్ దర్శకత్వం వహించగా, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరిలు కలిసి నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం. మరోవైపు, ఈ చిత్రం సక్సెస్ కావాలని చిత్ర బృందం తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments