Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైమండ్స్ వ్యాపారి హత్య కేసులో టీవీ నటి అరెస్టు

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (09:59 IST)
ముంబైకు చెందిన డైమండ్స్ వ్యాపారి హత్య కేసులో టీవీ నటి డెబోలినా భట్టాచార్యను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెను అరెస్టు చేసిన తర్వాత అరెస్టు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకు చెందిన వజ్రాల వ్యాపారి రాజేశ్వర్‌ ఉడాని ఇటీవల అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈ కేసులో రాజకీయ నాయకుడు సచిన్‌ పవార్‌ను అరెస్టు చేసిన పోలీసులు, టీవీ నటి డెబోలినా భట్టాచార్యను కూడా విచారించారు. సుమారు రెండు గంటల పాటు ఆమె వద్ద విచారణ జరిపిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. 
 
కాగా, వారం రోజుల క్రితం రాజేశ్వర్‌ ఉడాని కనిపించకుండా పోయారు. దీనిపై అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఉడాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన అతడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో రాయ్‌గఢ్‌ జిల్లాలోని అడవుల్లో గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అయితే, రాజేశ్వర్‌ కాల్‌డేటా ఆధారంగా అదృశ్యమవడానికి ముందు అతడు ఎవరెవరితో మాట్లాడన్న అంశాలపై విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే డెబోలినా భట్టాచార్యను విచారించి అదుపులోకి తీసుకున్నారు. రాజకీయ నేత సచిన్‌ పవార్‌ ద్వారా పలువురు మహిళలతో రాజేశ్‌కు పరిచయం ఏర్పడింది. సినీ ఇండస్ట్రీ, బార్‌ డాన్సర్లతో అతడు రెగ్యులర్‌గా కాంటాక్ట్‌లో ఉండేవాడని కాల్‌డేటా ఆధారంగా వెల్లడైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

ప్రముఖ న్యూస్ చానెల్ యాంకర్ ఆత్మహత్య

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం
Show comments