Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముదురుతున్న మ‌హ‌ర్షి వివాదం.... అస‌లు ఏం జరిగింది..?

Webdunia
గురువారం, 9 మే 2019 (11:22 IST)
ఊసూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన‌ 'మహ‌ర్షి' చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా ఈరోజు (మే 9) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దాదాపుగా రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది అని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే... తెలంగాణలోని అన్ని థియేటర్లలో మహర్షి చిత్రాన్ని 5 షోలు వేసుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
అద‌న‌పు ఆట‌తో పాటు టిక్కెట్ల రేటు పెంపుకు కూడా ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది అని ప్ర‌చారం జ‌రిగింది. సింగిల్ స్క్రీన్స్‌లో 80 రూపాయ‌ల టికెట్ 100 రూపాయ‌లు, 150 రూపాయ‌ల టికెట్ 200 రూపాయ‌ల‌కు పెంచారు. 
 
అస‌లు జ‌రిగింది ఏంటంటే... తెలంగాణ ప్రభుత్వంతో సంబంధం లేకుండా థియేటర్ ఓనర్లు కోర్టు ద్వారా రేట్లు పెంపునకు సంబంధించి అనుమతి తెచ్చుకున్నారట‌. ఈ విష‌యం పై తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే 79 థియేటర్లు ధరలను పెంచాయని మండిపడ్డారు. 
 
వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వం చేయదని.. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లాలని హోంశాఖ కార్యదర్శికి సూచించానని స్పష్టం చేశారు. థియేట‌ర్ ఓన‌ర్స్ పై తెలంగాణ ప్ర‌భుత్వం ఫైర్ అవుతోంది. మ‌రి... ఈ వివాదం ఎంత వ‌ర‌కు వెళుతుందో..? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments