Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్ డ్రగ్స్ కేసు : ఈడీ ముందుకు హీరో రానా

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (11:11 IST)
తెలుగు చిత్రపరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా బుధవారం ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్) అధికారుల ముందుకు మరో హీరో దగ్గుబాటి రానా వచ్చారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఇప్పటికే దర్శకుడు పూరీ జనగ్నాథ్, హీరోయిన్లు ఛార్మి, రకుల్, కెల్విన్‏లను విచారిచిందింది. 
 
దీంతో ఈడీ.. కొందరిలో వేడి పుట్టిస్తోంది. డ్రగ్స్ వాడారన్న ఆరోపణలతో పాటు భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయనే అరోపణల మధ్య ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులను ప్రశ్నలతో అధికారులు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇప్పుడు మరో బిగ్ హీరో వంతు వచ్చింది. బుధవారం భల్లాలదేవపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు ఈడీ సిద్ధమైంది.
 
ఇందుకోసం ఆయన హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రానా బ్యాంకు ఖాతాల వివరాలు ఇప్పటికే సేకరించినట్టుగా తెలుస్తోంది. అందులోని లావాదేవీలు, ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులోని ఇతరులతో ఉన్న సంబంధాలపైనా రానాను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అలాగే, హీరోయిన్ ముమైత్ ఖాన్‌ను కూడా బుధవారమే విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో రానా, రకుల్ పేర్లు లేవు. కానీ ఇప్పుడు ఈ కేసులో వీళ్లిద్దరికి ఈడీ సమన్లు పంపడం చర్చనీయాంశమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NDAతో మా కూటమి 2029 దాటి వెళ్ళబోతోంది.. చంద్రబాబు క్లారిటీ సమాధానం

ఉగ్రవాద నిరోధక ప్యానెల్‌కు పాకిస్థాన్‌కు వైస్ చైర్మన్ పదవా? రాజ్‌నాథ్ సింగ్ సూటి ప్రశ్న

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అజారుద్దీన్ తనయుడు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments