Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి పేరుతో పాఠశాల భవనం నిర్మించిన టాలీవుడ్ దర్శకుడు

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (09:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈయన మంచి మనస్సున్న మనిషి కూడా. చిన్నప్పుడు తాను చదువుకున్న తూర్పుగోదావరి జిల్లా మట్టపర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో తన తండ్రి తిరుపతినాయుడు పేరుతో రూ.18 లక్షలతో భవనం నిర్మించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‌తో కలిసి సుకుమార్ దంపతులు ఆదివారం ఈ భవనాన్ని ప్రారంభించారు.
 
ఆ తర్వాత సుకుమార్ మాట్లాడుతూ, మట్టపర్రు గ్రామాభివృద్ధికి తానెప్పుడూ ముందుంటానని చెప్పారు. తన తండ్రి పేరుతో స్కూలు భవనం నిర్మించి, ప్రారంభించిన క్షణాలు మర్చిపోలేనివంటూ భావోద్వేగానికి గురయ్యారు. 
 
ఈ సందర్భంగా తాను చదువుకున్న తరగతి గదులను చూస్తూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుకుమార్ ఆ పాఠశాలలో చదువుకున్నప్పటి రికార్డును ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఫ్రేమ్ కట్టించి సుకుమార్‌కు అందజేశారు. 
 
తాను దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ సెప్టెంబరులో తిరిగి ప్రారంభమవుతుందని సుకుమార్ తెలిపారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇందులో అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments