Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గడానికి తీసుకున్న చికిత్సే దాసరి ప్రాణాలు తీసింది: రేలంగి

దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి పట్ల సీనియర్ డైరక్టర్ రేలంగి నరసింహారావు స్పందించారు. బరువు తగ్గేందుకు తీసుకున్న చికిత్సే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానికి కారణమైందని రేలంగి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ

Webdunia
శనివారం, 1 జులై 2017 (09:45 IST)
దర్శకరత్న దాసరి నారాయణ రావు మృతి పట్ల సీనియర్ డైరక్టర్ రేలంగి నరసింహారావు స్పందించారు. బరువు తగ్గేందుకు తీసుకున్న చికిత్సే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణానికి కారణమైందని రేలంగి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ చికిత్స చేసుకోకపోయి వుంటే దాసరి మరో పదేళ్లు జీవించి వుండేవారని రేలంగి అన్నారు.

యూట్యూబ్ ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేలంగి మాట్లాడుతూ.. బరువు తగ్గించుకునే చికిత్సలో భాగంగా దాసరిగారు తొలుత జీర్ణాశయంలో బెలూన్ వేయించుకున్నారన్నారు. ఆపై ఆరేడు కిలోల బరువు తగ్గారని వెల్లడించారు. అదే నమ్మకంతోనే రెండోసారి దీనిపై కూడా సర్జరీకి వెళ్లి..బెలూన్‌ వేయించుకోవడమే ఆయన ప్రాణం తీసిందని తెలిపారు. రెండోసారి సర్జరీకి వెళ్లడమే దాసరి చేసిన తప్పు అని రేలంగి పేర్కొన్నారు. 
 
దాసరికి రెండోసారి పొట్టలో బెలూన్ వేసేటప్పుడే లోపం తలెత్తితే వైద్యులు దానిని సవరించి ఇంటికి పంపించారని అన్నారు. మొదటిసారి చికిత్స తీసుకున్నప్పుడు ఆయన ఎక్కువ ద్రవాహారన్నే తీసుకున్నారని తెలిపారు.

కానీ, రెండోసారి బెలూన్ వేయించుకునేందుకు వెళ్లినప్పుడు మాత్రం నోటి ద్వారా సాధారణ ఆహారాన్ని తీసుకునేందుకు చికిత్స చేయించుకున్నారన్నారు. అదే ఆయన ప్రాణానికి ముప్పు తెచ్చిందని వెల్లడించారు. సర్జరీకి వెళ్లకుండా ద్రవాహారాన్నే ఆయన తీసుకుని ఉంటే మరో పదేళ్లు బతికేవారని రేలంగి వివరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments