Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినీ నటుడు - క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు..

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (07:30 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు వయసు 64 యేళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 
 
రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. చినప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు.
 
1995లో ‘ఊరికి మొనగాడు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. మొత్తంగా 62 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. 
 
ముఖ్యంగా, రాజబాబు వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి వంటి బుల్లితెర సీరియళ్లలోనూ నటించారు. అమ్మ సీరియల్‌లోని పాత్రకు 2005లో నంది అవార్డు కూడా అందుకుని బుల్లితెర ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని: జర్నలిస్ట్ కృష్ణం రాజు

Amaravati: అమరావతి ప్రాంతంలో సెక్స్ వర్కర్లు ఎక్కువ.. వందకిపైగా ఎన్జీఓలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments