Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉప్పు, కారం లేని ఆహారం మాత్రమే తీసుకునేది.. శ్రీదేవిపై నోరువిప్పిన బోనీకపూర్

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2023 (12:28 IST)
2018లో అతిలోక సుందరి శ్రీదేవి కన్నుమూశారు. నటి మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తన భార్య మరణానంతరం ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కొన్నాళ్లపాటు మౌనం వీడారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు తన భార్య మరణం గురించి మాట్లాడారు.
 
24 ఫిబ్రవరి 2018 హిందీ సినిమా తన మొదటి సూపర్ స్టార్ శ్రీదేవిని శాశ్వతంగా కోల్పోయిన భయంకరమైన రోజు. దుబాయ్‌లో ఆమె ఆకస్మిక మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. హోటల్ బాత్‌రూమ్‌లోని బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందినట్లు సమాచారం. 
 
వీటిపై శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తాజాగా మరోసారి స్పందించారు. తన భార్య సడెన్‌గా చనిపోవడంతో దుబాయ్ పోలీసులు తనను సుదీర్ఘంగా విచారించారని తెలిపారు. దాదాపు 48 గంటల పాటు అన్ని రకాలుగా ప్రశ్నించి, శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్ర లేదని తేలడంతోనే తనను వదిలిపెట్టారని చెప్పారు.
 
తన భార్య చనిపోవడానికి కారణం ఆమె ఆహార నియమాలేనని భావిస్తున్నట్లు బోనీ కపూర్ చెప్పారు. శరీరాకృతిని అందంగా ఉంచుకునేందుకు ఆమె కఠినమైన డైట్‌ను ఫాలో అయ్యేదని తెలిపారు. 
 
ఉప్పు, కారం లేని ఆహారం మాత్రమే, అదీ అతి తక్కువ పరిమాణంలో తీసుకునేదని వివరించారు. దీంతో శ్రీదేవి లోబీపీతో బాధపడేదని, తరచూ కళ్లు తిరిగి పడిపోయేదని బోనీ కపూర్ చెప్పారు. వైద్యులు చెప్పినా ఆమె తన ఆహారపుటలవాట్లను మార్చుకోలేదని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments