Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్కెట్ రేట్ పెంచ‌డంలో త‌ప్పులేదు - చిరంజీవి

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (18:05 IST)
Chiranjeevi
ఇప్పుడు ఏ అగ్ర‌హీరో సినిమా విడుద‌ల‌యినా వెంట‌నే వారంరోజుల‌పాటు టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. అందుకు ప్రభుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపిన సంద‌ర్భాలున్నాయి. ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా త‌ర్వాత తెలుగులో వ‌స్తున్న భారీ సినిమా ఆచార్య‌. దీనికి తెలంగాణ ప్ర‌భుత్వం టికెట్ రేట్లు పెంచుకోవ‌చ్చ‌ని వెసులుబాటు క‌ల్పించింది.  ఆచార్య సినిమా ఏప్రిల్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. టికెట్ల  విష‌య‌మై చిరంజీవిని ప్ర‌శ్నిస్తే, ఆయ‌న ఆస‌క్లిక‌రంగా స‌మాధానం ఇచ్చారు. చివ‌ర్లో ద‌ర్శ‌కుడు కొర‌టాల కూడా మాట్లాడారు. 
 
 “చిరంజీవి  సినిమా అంటేనే అన్ని థియేటర్స్  హౌస్ ఫుల్ అవుతాయి. అలాంటప్పుడు ‘ఆచార్య’కి టికెట్ రేటు పెంచవలసినన అవసరం ఉందా?’ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చిరు మాట్లాడుతూ” పాండమిక్ కారణంగా చాలా రంగాలు కుదేలయ్యాయి. అలా సినిమా పరిశ్రమ కూడా  చాలా ఇబ్బందుల్లో పడింది. వడ్డీగా 50 కోట్లను కట్టడమనేది ఎప్పుడైనా విన్నారా? ఎవరిస్తారు చెప్పండి?.
ప్రభుత్వాలు కనికరించి ఇలాంటి జీవోలు ఇస్తే మనకి ఇంత వినోదాన్ని ఇచ్చారు మనం కూడా ఒక పది రూపాయలు  ఇద్దామని ప్రేక్షకులు అనుకుంటారు. ఇది అడుక్కుతినడం కాదు. వినోదాన్ని అందించే ప్రయత్నంలో అనుకోకుండా అంతకంతకీ వడ్డీలు అయ్యాయి. వడ్డీనే ఒక మీడియం సినిమా బడ్జెట్ అంత అయింది. మేము కూడా 42 పర్సెంట్ టాక్స్ లు కడుతున్నాము. అందులో కొద్దిగా తిరిగి ఇవ్వండి అని అడగడంలో తప్పేమి లేదు.. తప్పు అని కూడా అనుకోవడం లేదు” అని అన్నారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments