Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ది ఐరన్ లేడీ' జయలలిత బయోపిక్.. అమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్

తమిళనాడు దివంగత మఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ త్వరలో రానుంది. ఎన్‌టీఆర్‌ జీవితచరిత్రను సినిమాగా నిర్మిస్తున్న విబ్రి మీడియానే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. జయలలిత జన్మదినమైన ఫిబ్రవరి 24న షూటింగ్‌ ప్రారంభిం

Webdunia
ఆదివారం, 23 సెప్టెంబరు 2018 (14:53 IST)
తమిళనాడు దివంగత మఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ త్వరలో రానుంది. ఎన్‌టీఆర్‌ జీవితచరిత్రను సినిమాగా నిర్మిస్తున్న విబ్రి మీడియానే ఈ చిత్రాన్ని నిర్మించనుంది. జయలలిత జన్మదినమైన ఫిబ్రవరి 24న షూటింగ్‌ ప్రారంభించి, ఫస్ట్‌లుక్‌ విడుదల చేయనున్నట్లు తెలిసింది. 'మద్రాసపట్టణం' అనే గొప్ప చిత్రాన్ని తీసిన ఏఎల్‌ విజయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని, తమిళం, తెలుగు, హిందీలో విడుదల చేయాలని నిర్మాతలు ప్రణాళికలు రచిస్తున్నారు.
 
నిజానికి జయలలిత అటు వెండితెరపైనేకాకుండా.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. తమిళ ప్రజలకు అమ్మగా.. కోట్లాది ప్రజలకు దేవతగా... జయలలిత చేసిన సేవలను ఎన్నటికీ తమిళనాట చెరగని ముద్రనే. జయ జీవితం పూలపాన్పేమీ కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఆమె ఎదుర్కొన్నారు. అందుతే ఆమె జీవితాన్ని వెండితెరపైకి తీసుకొస్తున్నారు.
 
ఆమె జీవితాన్ని బయోపిక్‌గా తీసుకురావడానికి దాదాపు ఐదుగురు డైరెక్టర్లు ముందుకు వచ్చారు. వారిలో ఒకరు ప్రియదర్శిని. ప్రియదర్శిని డైరెక్ట్‌ చేయబోయే అమ్మ బయోపిక్‌ టైటిల్‌ పేరును, ఫస్ట్‌ లుక్‌ను డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్ ఆవిష్కరించారు.
 
జయలలిత బయోపిక్‌ 'ది ఐరన్‌ లేడి' టైటిల్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేయడం చాలా సంతోషంగా, ఉత్తేజితంగా ఉంది. ప్రియదర్శిని, టీమ్‌ గ్రాండ్‌ సక్సెస్‌ సాధించాలని ఆశిస్తున్నా అంటూ ఏఆర్‌ మురుగదాస్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చాలా గ్రాండ్‌గా జరగనుందని కూడా ప్రకటించారు. 
 
ఈ బయోపిక్‌లో జయలలిత పాత్రలో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతున్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగా నిలిచిన అమ్మ చిత్రం 'ది ఐరన్‌ లేడి' గురించి గత నాలుగు నెలలుగా చర్చిస్తూనే ఉన్నామని ప్రియదర్శిని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments