Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పేట' వర్సెస్ 'విశ్వాసం' - కత్తులతో ఫ్యాన్స్ కొట్లాట

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (11:06 IST)
తమిళనాడు రాష్ట్రంలో సంక్రాంతి రెండు మూడు రోజుల ముందుగానే వచ్చినట్టుగా ఉంది. తమతమ అభిమాన హీరోల చిత్రాలు ఒకేరోజు విడదలయ్యాయి. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. రజినీకాంత్ నటించిన 'పేట', అజిత్ నటించిన 'విశ్వాసం' చిత్రాలు జనవరి పదో తేదీ గురువారం విడులయ్యాయి. 
 
దీంతో ఈ చిత్రాలు విడుదలైన థియేటర్ల వద్ద సందడిగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు చిత్రాలు పక్కపక్క థియేటర్లలో ఆడుతుంటడంతో ఇరు హీరోల అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. చెన్నై నగరంలోన రోహిణి థియేటర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో థియేటర్ల వద్ద ఇరు హీరోల అభిమానులు కత్తులతో పోట్లాడుకున్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. 
 
అలాగే, మదురైలోని ఓ థియేటర్‌లో ఇరు హీరోల అభిమానుల మధ్య తొలుత వాగ్వాదంతో ప్రారంభమైన ఘర్షణ, ఆపై కత్తులతో దాడులు చేసుకునేంత వరకూ వెళ్లింది. అభిమానులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అభిమానులను చెదరగొట్టారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments