Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకటి హిట్టు.. రెండు ఫట‌్టు .. టాలీవుడ్‌లో మూడు చిత్రాల సందడి - ఆగస్టు హీరో ఎవరంటే...?

ఒకేరోజు మూడు చిత్రాలు విడుదల. ఇది నిజంగా సినీ అభిమానులకే పండుగే. ఈ మూడింటిలో బాహుబలి తరువాత రానా నటించిన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి" కావడంతో అభిమానుల అంచనాలు మించుతున్నాయి. దాంతో పాటు లవర్ బాయ్ నితిన్ పక్కా యాక్షన్ కథతో వచ్చిన "లై", మరోవైపు యాక్షన

Webdunia
శుక్రవారం, 11 ఆగస్టు 2017 (10:51 IST)
ఒకేరోజు మూడు చిత్రాలు విడుదల. ఇది నిజంగా సినీ అభిమానులకే పండుగే. ఈ మూడింటిలో బాహుబలి తరువాత రానా నటించిన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి" కావడంతో అభిమానుల అంచనాలు మించుతున్నాయి. దాంతో పాటు లవర్ బాయ్ నితిన్ పక్కా యాక్షన్ కథతో వచ్చిన "లై", మరోవైపు యాక్షన్ కథా చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన "జయ జానకి నాయక" సినిమా. ఈ మూడు ఒకేరోజు రిలీజవడంతో తెలుగు సినీ అభిమానులకు ఒక పండుగ వచ్చినట్లుంది.
 
అయితే ఈ మూడు సినిమాలు రిలీజయ్యాయి కానీ అందులో ఒక సినిమా హిట్ టాక్‌తోనూ.. మిగిలిన రెండు యావరేజ్ టాక్‌తో నడుస్తున్నట్లు సినీ వర్గాలు అప్పుడే చెప్పుకుంటున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన 'జయ జానకి నాయక' సినిమా హిట్ టాక్‌తో ముందుకు దూసుకెళుతోంది. విభిన్న కథతో బోయపాటి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. 'నేనే రాజు.. నేనే మంత్రి' సినిమా స్టోరి రొటీన్‌గా ఉండటంతో ప్రేక్షకుల నుంచి యావరేజ్ టాక్ వినిపిస్తోంది. కేవలం రానా డైలాగ్‌లు, కాజల్ అందాలను చూడటానికి మాత్రమే తెలుగు ప్రేక్షకులు వెళుతున్నారట. స్టోరీలో కొత్తదనం కనిపించడం లేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
 
ఇక మిగిలింది 'లై'. చాలా గ్యాప్ తర్వాత నితిన్ నటించిన సినిమా. ఒకప్పటి అగ్ర హీరో అర్జున్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా కథ కూడా కొత్తగా లేకపోవడంతో పాటు మొదటి భాగం మాత్రమే బాగుండటం, రెండో భాగం బోర్‌గా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాను కూడా యావరేజ్‌గా తేల్చేశారట. మొదటి రోజు కావడంతో అన్ని థియేటర్లు మాత్రం హౌస్‌ఫుల్ కనిపిస్తున్నాయి కానీ.. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రానికి తక్కువ రేటింగ్ ఇస్తుండటం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments