బిగ్ బాస్ రియాల్టీ షో ఐదో సీజన్ తెలుగు ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించే ఈ షో... కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. ఎట్టకేలకే సెప్టెంబర్ 5న గ్రాండ్గా లాంచ్ అయింది.
ఈ సారి ఊహించని విధంగా 19 మంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌజ్లోఅడుగుపెట్టారు. ఇక తొలి రోజు లోబో తన గురకతో ఇంటి సభ్యులకు నిద్ర లేకుండా చేశాడు. మధ్య రాత్రి అందరు లేచి లోబోనే చూస్తుండగా, ఆయనతో యాంకర్ రవి కొంత కామెడీ చేయించాడు.
తొలి వారం నామినేషన్ ప్రక్రియ కోసం బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వారి ఫొటోలతో ఉన్న చెత్త బ్యాగులు తీసుకొని డస్ట్ బిన్లో వేయాలని చెప్పాడు. ఇ
లా ప్రతి కంటెస్టెంట్ సరైన కారణం చెప్పి ఇద్దరి కంటెస్టెంట్స్ని నామినేట్ చేయాల్సిందిగా కోరాడు. అయితే హౌజ్లో అడుగు పెట్టి ఒక్కరోజే కావడంతో నామినేట్ చేయడానికి నానా కారణాలు వెతుక్కోవల్సి వచ్చింది.
ఈ నామినేషన్ ప్రక్రియలో కొందరి మధ్య వాగ్వాదం జరగగా, కొందరు తమపై వేసిన ఆరోపణలు ఖండించారు. జెస్సీ, కాజల్, హమీదా వంటి వారు ఎమోషనల్ అయి కన్నీరు పెట్టుకున్నారు. ఇక చివరిగా ఫస్ట్ వీక్లో ఎక్కువ ఓట్లు వచ్చిన రవి, మానస్, సరయూ, కాజల్, హమీదా, జెస్సీలు నామినేషన్లో ఉన్నారు. ఇందులో నుండి ఒకరు బయటకు వెళ్లనున్నారు.