Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాన్నకు అక్కడకు వెళ్లే టైమ్ వచ్చింది.. వెళ్లారు.. పితృవియోగంపై హీరో సుశాంత్

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. నాన్నకు అక్కడకు వెళ్లే సమయం వచ్చింది.. అందుకే అక్కడకు వెళ్లారు అంటూ సుశాంత్ అన్నారు. అక్కినేని కుటుంబంలోని నవతరం హీర

Webdunia
శుక్రవారం, 19 మే 2017 (10:31 IST)
తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. నాన్నకు అక్కడకు వెళ్లే సమయం వచ్చింది.. అందుకే అక్కడకు వెళ్లారు అంటూ సుశాంత్ అన్నారు. అక్కినేని కుటుంబంలోని నవతరం హీరో సుశాంత్ తండ్రి అనుమోలు సత్య భూషణ్ రావు గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. తన తండ్రితో అనుబంధాన్ని, ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సుశాంత్, తన సోషల్ మీడియా ద్వారా హృదయాన్ని తాకేలా స్పందించాడు. 
 
ఆయన చాలా సరదాగా ఉండేవారని, చాలా నెమ్మదైన వ్యక్తని, ఎల్లప్పుడూ నవ్వుతూనే ఉంటారు. స్నేహితులు, కుటుంబంతో ఆయన గడిపిన మధుర జ్ఞాపకాలు తన మదినిండా ఎప్పటికీ పదిలంగా ఉండిపోతాయి. ఆయనకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే సమయం వచ్చిందని, అందుకే వెళ్లిపోయారంటూ పోస్ట్ చేశాడు. 
 
ఆయన జీవితంలో తామంతా భాగమైనందుకు సంతోషంగా ఉందని అంటూనే, తండ్రిని చాలా మిస్సవుతున్నానని, ఈ సమయంలో తన కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్న సన్నిహితులు, బంధువులకు ధన్యవాదాలని అన్నాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలసి చిన్నప్పుడు దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు సుశాంత్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments