Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదంలో కన్నడ బుల్లితెర నటీనటుల దర్మరణం

కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ నటీనటులు దుర్మరణం పాలయ్యారు. మృతులు రచన (23), జీవన్ (25)లుగా గుర్తించారు. వీరిద్దరు మహానది, త్రివేణి సంగమ, మధుబాల వంటి కన్నడ సీరియల్స్‌లలో నటించారు.

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2017 (13:01 IST)
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ నటీనటులు దుర్మరణం పాలయ్యారు. మృతులు రచన (23), జీవన్ (25)లుగా గుర్తించారు. వీరిద్దరు మహానది, త్రివేణి సంగమ, మధుబాల వంటి కన్నడ సీరియల్స్‌లలో నటించారు. 
 
కన్నడ బుల్లితెరకు చెందిన రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్‌లతో కలిసి జీవన్, రచన బెంగుళూరు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రానికి వెళ్లారు. బుధవారం కార్తీక్ బర్త్‌డే సందర్భంగా పూజలు నిర్వహించి అక్కడే బర్త్‌డే పార్టీ చేసుకుని గురువారం తెల్లవారు జామున సఫారీ కారులో తిరుగు ప్రయాణమయ్యారు. 
 
కారు కర్ణాటకలోని మాగుడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి వద్దకు రాగానే.. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రచన, జీవన్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన ఇతర నటులను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments