Webdunia - Bharat's app for daily news and videos

Install App

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌కు బెయిల్

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (14:05 IST)
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ నృత్య కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనకు భారీ ఊరట లభించినట్టయింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడికి పాల్పడినట్టు తన శిష్యురాలు, మహిళా కొరియోగ్రాఫర్ శృష్టివర్మ హైదరాబాద్ నగర పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. దీంతో గత నెల 16వ తేదీన ఆయనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. 
 
ఆ తర్వాత ఆయనకు కోర్టు రిమాండ్ విధించడంతో గత నెల రోజులుగా ఆయన చంచల్‌గూడ జైలులో ఉంటున్నారు. జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నేపథ్యంలో అక్టోబరు 6 నుంచి 9వ తేదీ వరకు ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరుచేసింది. అయితే, ఆయనకు ఇచ్చిన జాతీయ అవార్డును కేంద్రం రద్దు చేసింది. దీంతో ఆయన మళ్లీ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. 
 
తాజాగా ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు... ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జానీ మాస్టర్ గురువారం సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. జానీ మాస్టర్‌కు బెయిల్ రావడంతో అనేక మంది నృత్య దర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం