Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి-2' కలెక్షన్లను రైతులకెందుకివ్వాలి.. పైసా ఇవ్వొద్దు: తమ్మారెడ్డి భరద్వాజ

'బాహుబలి' చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చిన కలెక్షన్ల సొమ్ములో రైతులకు ఎందుకివ్వాలంటూ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేస్తున్న విమర్శలను ఆయన

Webdunia
బుధవారం, 3 మే 2017 (16:00 IST)
'బాహుబలి' చిత్ర ప్రదర్శన ద్వారా వచ్చిన కలెక్షన్ల సొమ్ములో రైతులకు ఎందుకివ్వాలంటూ ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రశ్నించారు. ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చేస్తున్న విమర్శలను ఆయన తనదైనశైలిలో స్పందించారు. రైతులకు, సినిమా కలెక్షన్లకు ముడిపెట్టి మాట్లాడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి పోస్టు పెట్టడం ధర్మం కాదన్నారు. 
 
'బాహుబలి-2' సినిమా రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో రైతుల కష్టాలకు, బాహుబలి-2 కలెక్షన్లకు లింకు పెడుతూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీటిపై ఆయన స్పందించారు. బాహుబలి చాలా కష్టపడి తీశారు కాబట్టి వారి కష్టాన్ని గౌరవించి మేము సినిమా చూశాం కాబట్టి దానికి రూ.వెయ్యి కోట్లు వస్తాయి కాబట్టి రైతులు కూడా కష్టపడుతున్నారు కాబట్టి దాంట్లో నుండి వంద కోట్లు రైతులకు ఇవ్వాలని... ఒకాయన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు, ఆయన చెప్పంది వినడానికి బావుంది అంటూనే.... తమ్మారెడ్డి తనదైన రీతిలో కౌంటర్ వేశారు.
 
బాహుబలి కష్టపడి తీశారని అంటున్నారు... మరి మనం ఆ సినిమా తీసినవారి మీద జాలి పడ్డామో? సినిమా మనకు నచ్చిందో? అందరూ చూస్తున్నారు మనం చూడక పోతే తప్పు అనుకున్నామో? మొత్తానికి వెళ్లి చూశా.... అంత వరకు తప్పులేదు. అది చూసి రైతులకు డబ్బులు ఇవ్వాలని అనడం ఎందుకు? అలా అనడం ముమ్మాటికీ తప్పే అని తమ్మారెడ్డి అన్నారు.
 
రైతులు మీరు పుట్టక ముందు నుండీ, నేను పుట్టక ముందు నుండీ, భూమి పుట్టినప్పటి నుండి వారు వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నారు. ఇపుడు వాళ్లకి గిట్టుబాట ధర లభించడం లేదు. మనలో చాలా మంది వ్యవసాయం వదిలిపెట్టి సిటీకి వలస వచ్చిన వాళ్లం ఉన్నాం. వ్యవసాయం చేయని వాళ్లం ఉన్నాం. కష్టపడి తీశారు కాబట్టి జాలిపడి సినిమా చూసామని చెబుతున్న వారంతా రైతు మీద ఎందుకు జాలి పడటం లేదని ప్రశ్నించారు. ఒక సినిమా హిట్ కావడం వల్ల వచ్చిన కోట్లాది రూపాయల్లో కొంతం రైతులకు ఇవ్వాలని చెప్పడం భావ్యం కాదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments