Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ కథానాయకుడు'పై తమిళ్ రాకర్స్ పంజా.. నెట్‌లో లీక్

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (16:05 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం 'ఎన్టీఆర్ కథానాయుడు'. ఈ చిత్రం జనవరి 9వ తేదీ బుధవారం విడులైంది. మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. అయితే, ఈ చిత్రం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం తమిళ్ రాకర్స్. 
 
నిజానికి తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్ దెబ్బకు తమిళ చిత్ర నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. రజినీకాంత్ వంటి '2.0' చిత్రాన్ని విడుదలకు ముందే లీక్ చేస్తామని సవాల్ విసిరిన తమిళ్ రాకర్స్.. అంతన్నపని చేసింది. 
 
ఇపుడు తెలుగు చిత్రసీమపై దృష్టిసారించింది. వాస్తవానికి ఇప్పటివరకు తెలుగు చిత్రాలపై తమిళ్ రాకర్స్ పెద్దగా దృష్టిసారించింది లేదు. కానీ తొలిసారి 'ఎన్టీఆర్ కథనాయకుడు' చిత్రాన్ని తమిళ్ రాకర్స్ రిలీజ్ చేసింది. గతంలో మద్రాసు హైకోర్టు ఆదేశం మేరకు 12 వేల నకిలీ సైట్స్‌ను నిషేధించారు. వాటిలో ఒకటి తమిళ్ రాకర్స్. 
 
కానీ, హైకోర్టు ఉత్తర్వులు పెద్దగా ప్రభావం చూపలేదు. ఫలితంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు'తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం 'పేట' మూవీని ఆ వెబ్‌సైట్ లీక్ చేసినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments