Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ కథానాయకుడు'పై తమిళ్ రాకర్స్ పంజా.. నెట్‌లో లీక్

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (16:05 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం 'ఎన్టీఆర్ కథానాయుడు'. ఈ చిత్రం జనవరి 9వ తేదీ బుధవారం విడులైంది. మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. అయితే, ఈ చిత్రం నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనికి కారణం తమిళ్ రాకర్స్. 
 
నిజానికి తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్ దెబ్బకు తమిళ చిత్ర నిర్మాతలు బెంబేలెత్తిపోతున్నారు. రజినీకాంత్ వంటి '2.0' చిత్రాన్ని విడుదలకు ముందే లీక్ చేస్తామని సవాల్ విసిరిన తమిళ్ రాకర్స్.. అంతన్నపని చేసింది. 
 
ఇపుడు తెలుగు చిత్రసీమపై దృష్టిసారించింది. వాస్తవానికి ఇప్పటివరకు తెలుగు చిత్రాలపై తమిళ్ రాకర్స్ పెద్దగా దృష్టిసారించింది లేదు. కానీ తొలిసారి 'ఎన్టీఆర్ కథనాయకుడు' చిత్రాన్ని తమిళ్ రాకర్స్ రిలీజ్ చేసింది. గతంలో మద్రాసు హైకోర్టు ఆదేశం మేరకు 12 వేల నకిలీ సైట్స్‌ను నిషేధించారు. వాటిలో ఒకటి తమిళ్ రాకర్స్. 
 
కానీ, హైకోర్టు ఉత్తర్వులు పెద్దగా ప్రభావం చూపలేదు. ఫలితంగా 'ఎన్టీఆర్ కథానాయకుడు'తో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం 'పేట' మూవీని ఆ వెబ్‌సైట్ లీక్ చేసినట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments