Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోలీవుడ్‌ను పగబట్టిన కరోనా వైరస్ : మరో కమెడియన్ మృతి

Webdunia
గురువారం, 6 మే 2021 (11:30 IST)
తమిళ చిత్ర పరిశ్రమను కరోనా వైరస్‌ పగబట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ సెలెబ్రిటీలు కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో హాస్యనటుడు కరోనా వైరస్ సోకి చనిపోయారు. ఆయన పేరు పాండు. వయసు 74 యేళ్లు. 
 
క‌రోనాతో కొద్ది రోజులుగా చెన్నైలోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయ‌న గురువారం తుది శ్వాస విడిచారు. పాండుకు భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే పాండు భార్య‌కు కూడా క‌రోనా సోక‌గా, ఆమె ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
పాండు మృతి ప‌ట్ల ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. 1970లో మానవన్ తో నటుడిగా అరంగేట్రం చేసిన పాండు ‘కరైల్లెం షేన్‌బాగపూ’తో అతనికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
 
మరోవైపు, సీనియర్‌ గాయకుడు, నటుడు టీకేఎస్‌ నటరాజన్‌(87) బుధవారం చెన్నైలో కన్నుమూశారు. ఈయ‌న శివాజీ గణేశన్, ఎంజీఆర్, కమలహాసన్, రజనీకాంత్‌ వంటి ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. ఈయన అనారోగ్య సమస్యలతో బుధవారం కన్నుమూశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments