Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్ వర్సెస్ శరత్ కుమార్: మాటల యుద్ధంతో పాటు క్రిమినల్ కేసులు..

Webdunia
శనివారం, 10 అక్టోబరు 2015 (11:33 IST)
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్) ఎన్నికలు మాటల యుద్ధంతో పాటు క్రిమినల్ కేసులు నమోదవడానికి కూడా వేదికగా మారాయి. తమిళ చిత్రసీమలో పెను వివాదానికి తెరతీసిన నడిగర్ సంఘం ఎన్నికల్లో భాగంగా తారల మధ్య నువ్వా నేనా అన్నట్లు వార్ జరుగుతోంది. 
 
ప్రస్తుతం నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న ప్రముఖ నటుడు శరత్ కుమార్ మరోమారు ఆ పదవిని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో శరత్ కుమార్‌పై పలు ఆరోపణలు చేసిన యువ హీరో విశాల్ ఆయనకు పోటీగా నడిగర్ అధ్యక్ష బరిలో దిగేందుకు రెడీ అయ్యాడు. దీనిపై ఇరు వర్గాల మధ్య ఘాటు విమర్శలతో పాటు వ్యక్తిగత విమర్శలు సైతం తూటాల్లా పేలుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తనపై విశాల్ చేసిన ఆరోపణలన్నింటినీ పూసగుచ్చిన శరత్ కుమార్ యువ హీరోపై శుక్రవారం ఎగ్మూర్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న విశాల్ కూడా ఘాటుగానే స్పందించాడు. శరత్ కుమార్‌పై తాను కూడా కేసు నమోదు చేస్తానని విశాల్ ప్రకటించాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments