అచ్చం వైఎస్ఆర్‌లాగే ఆలోచన చేస్తున్న జగన్ : దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (12:29 IST)
అచ్చం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, జగన్ గురించి చెప్పాలని అనిపించి తాను మీడియా ముందుకు వచ్చినట్టు చెప్పారు. ఆయన గురించి చెప్పకుంటే తప్పు చేసిన వాడిగా మిగులుతానన్న భావన కలిగిందని అన్నారు.
 
రాష్ట్రంలో వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి, ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్న జగన్‌కు రాష్ట్ర ప్రజలంతా అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి చిన్న విషయంపైనా ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు. 
 
ముఖ్యంగా, విద్య, ఉద్యోగం, వైద్యం, సంక్షేమం తదితర అంశాల గురించి ఆలోచించే జగన్ సీఎం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఆయనకు ఉందని, జగన్ చేస్తున్న ప్రతి పనీ తన మనసులో నాటుకుందని ఎస్వీ కృష్ణారెడ్డి తెలిపారు. 
 
తన తండ్రి దివంగత వైఎస్. రాజశేఖర్ రెడ్డి ఎలా ఆలోచించేవారో, జగన్ కూడా అలానే ఆలోచిస్తున్నారని, ప్రజల మేలుకోరే ఇటువంటి నాయకుడు అధికారంలోకి రావడం అవసరమని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరేంద్ర మోదీతో అంత ఈజీ కాదు.. గౌరవం వుంది.. మోదీ కిల్లర్: డొనాల్డ్ ట్రంప్ కితాబు

అబ్బా.. మొంథా బలహీనపడ్డాక.. తీరిగ్గా గన్నవరంలో దిగిన జగన్మోహన్ రెడ్డి

Montha Cyclone: మరో రెండు రోజులు పనిచేయండి.. చంద్రబాబు ఏరియల్ సర్వే (video)

Khammam: మొంథా ఎఫెక్ట్.. నిమ్మవాగు వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. డ్రైవర్ గల్లంతు

మొంథా తుఫానుతో అపార నష్టం... నిత్యావసర వస్తువుల పంపిణీకి ఆదేశం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments