Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ ఆత్మహత్య కేసు.. స్పిర్చువల్ హీలింగ్ ఇచ్చారు.. రియా అరెస్ట్‌కు రంగం సిద్ధం?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (17:20 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు స్పిర్చువల్ హీలింగ్ చేసినట్లు మోహన్ జోషి అనే వ్యక్తి చెప్తున్నాడు. తన చేతి స్పర్శతో సుశాంత్‌కు ట్రీట్మెంట్ ఇచ్చినట్లు మోహన్ జోషి చెప్పాడు. అనుమాస్పదంగా మారిన సుశాంత్ కేసును సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మానసిక ఒత్తిడిలో ఉన్నాడని, అతనికి చికిత్స చేయాలని రియా తనతో చెప్పినట్లు మోహన్ జోషి తెలిపాడు. 
 
లలిత్ హోటల్ వెనుక ఉన్న వాటర్ రిసార్ట్‌లో సుశాంత్‌కు మానసిక చికిత్స చేసినట్లు జోషి చెప్పాడు. మరుసటి రోజు రియా ఫోన్ చేసి.. చాలా రోజుల తర్వాత సుశాంత్ నవ్వినట్లు చెప్పిందన్నాడు. మరోసారి ట్రీట్మెంట్ కావాలంటే తన ఆఫీసు రావాలంటూ చెప్పానన్నాడు. కానీ వారు రాలేదన్నాడు. సుశాంత్‌ను మళ్లీ చూడలేదని మోహన్ జోషి చెప్పాడు. అయితే జోషి మాటల్లో ఎంత వాస్తవం ఉందో ఇంకా తేలాల్సి ఉన్నది. మాజీ ఎస్‌బీఐ ఉద్యోగి అయిన జోషి.. స్పిర్చువల్ హీలింగ్ కూడా చేస్తుంటాడు.
 
మరోవైపు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి, ఆమె తండ్రికి సీబీఐ సమన్లు జారీ చేసింది. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న రియాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏ క్షణమైనా ఆమెను సీబీఐ అరెస్ట్ చేయనుందని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు సుశాంత్‌ది ఆత్మహత్యనా లేక హత్య అన్నదానిపై సీబీఐ విచారణ కొనసాగిస్తుంది.
 
ముంబైలోని సుశాంత్ ఫ్లాట్‌లో సీబీఐ ప్రత్యేక బృందం నేడు డమ్మీ టెస్ట్ నిర్వహించింది. సుశాంత్ ఎత్తు 5 ఫీట్ల 10 అంగుళాలు కాగా ఫ్యాన్‌కు, బెడ్‌కు మధ్య 5 ఫీట్ల 11 అంగుళాల ఎత్తు ఉంది. అపార్ట్‌మెంట్లోని రూఫ్ ఎత్తు 9 ఫీట్ల 3 అంగుళాలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అసలు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా హత్య జరిగిందా అన్నదానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. 
 
సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతున్న పోస్టుమార్టం రిపోర్టులో ఘటన ఎన్ని గంటలకు జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. సుశాంత్ నివాసం నుంచి దగ్గర్లోనే రెండు హాస్పిటల్స్ ఉన్నా ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కూపర్ హాస్పిటల్‌కే సుశాంత్ డెడ్‌బాడీని ఎందుకు తరలించారన్న దానిపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments