Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతోనే...

Webdunia
సోమవారం, 15 జూన్ 2020 (12:45 IST)
ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ఈ పోస్టు మార్టం రిపోర్టును వైద్యాధికారులు విడుదల చేశారు. దీనిలో పేర్కొన్న వివరాల ప్రకారం, ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించారు. 
 
మెడకు ఉచ్చు గట్టిగా బిగుసుకోవడంతో, ఊపిరి ఆడక, నరాలు తెగి ఆయన మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం సుశాంత్ మరణం సినీ, క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ అంత్యక్రియలు, ఆయన స్వస్థలమైన పాట్నాలోనే నిర్వహించనున్నామని కుటుంబీకులు వెల్లడించారు. 
 
నేడు అంత్యక్రియలు 
భారత క్రికెటర్ ఎంఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీలో హీరోగా నటించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. అతని అంత్యక్రియలు సోమవారం ముంబైలో జరుగనున్నాయి. అంతేకాకుండా, సుశాంత్ మృతదేహాని కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో నెగెటివ్ అని తేలింది. దీంతో సుశాంత్ కుటుంబ సభ్యులో ఈ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సుశాంత్ కుటుంబ సభ్యులు పాట్నా నుంచి ముంబైకు ఇప్పటికే చేరుకున్నారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సుశాంత్... ముంబై బాంద్రాలోని తన నివాసంలోనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీనిపై స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
మరోవైపు, తన కుమారుడు సుశాంత్ మరణ వార్త తెలుసుకున్న తండ్రి కృష్ణకుమార్ సింగ్ కుప్పకూలిపోయారు. ఈయన పాట్నాలో నివసిస్తున్నారు. ఆయనకు ఈ మరణవార్త తెలియగానే కుప్పకూలిపోయారు. సుశాంత్ ఆత్మహత్య విషయం తెలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పాట్నా నివాసంలో సంరక్షకురాలిగా వ్యవహరిస్తున్న లక్ష్మీ దేవి వెల్లడించారు. 
 
సుశాంత్ అక్క చండీగఢ్ నుంచి పాట్నా బయల్దేరారని తెలిపారు. సుశాంత్ స్వస్థలం బీహార్ లోని పూర్ణియా జిల్లా మాల్దిహా ప్రాంతం. సినిమాలపై ఆసక్తితో ముంబయి చేరుకుని అంచెలంచెలుగా ఎదిగాడు. కానీ డిప్రెషన్‌కు‌లోనై బలవన్మరణం చెందినట్టు భావిస్తున్నారు. కానీ, సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

Sri Reddy: పోలీసుల విచారణకు హాజరైన నటి శ్రీరెడ్డి.. క్షమించమని కోరినా వదల్లేదు

Smita Sabharwal, నాకు ఒక్కదానికే నోటీసా, 2 వేల మందికి కూడానా?: స్మితా సభర్వాల్ ప్రశ్న

speak in Hindi, ఏయ్... ఆటో తోలుతున్నావ్, హిందీలో మాట్లాడటం నేర్చుకో: కన్నడిగుడితో హిందీ వ్యక్తి వాగ్వాదం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments