చెన్నై వరద బాధితుల కోసం సూర్య-కార్తీ రూ.10 లక్షల సాయం

Webdunia
మంగళవారం, 5 డిశెంబరు 2023 (16:29 IST)
Surya_Karthi
సూర్య, కార్తీ మన టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోలు. ఇక ఈ ఇద్దరి సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండగా, వీరి తదుపరి చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఆది, సోమవారాల్లో తమిళనాడులో కురిసిన భారీ వర్షాల కారణంగా నీటిమట్టం పెరగడంతో పలు ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. 
 
చెన్నై వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సోదరులు సూర్య, కార్తీ ఇద్దరూ ముందుకొచ్చారు. చెన్నై వరద బాధితుల కోసం సూర్య, కార్తీ 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు నటీనటులు సూర్య, కార్తీ రూ. 10 లక్షలు ప్రకటించినట్లు పీఆర్వో మనోబాల విజయబాలన్ వెల్లడించారు. 
 
ప్రస్తుతం సూర్య తన బ్లాక్‌బస్టర్ మూవీ కంగువతో బిజీగా ఉన్నాడు. ఇది శివ దర్శకత్వంలో, ఆది నారాయణ రాసిన పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. స్టూడియో బ్యానర్‌పై కె ఇ జ్ఞానవేల్ రాజా, వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీ ఇటీవల జపాన్ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments