Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొగుడుపోయిన తర్వాత విచ్చలవిడి అయిందని కామెంట్స్ చేస్తున్నారు... సురేఖావాణి

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (14:01 IST)
మొగుడుపోయిన తర్వాత బాగా విచ్చలవిడి అయిపోయిందని చాలా మంది దారుణంగా కామెంట్స్ చేస్తున్నారని సినీ నటి సురేఖావాణి అన్నారు. ఆమె తాజాగా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కుమార్తె, వ్యక్తిగతంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించారు. ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, "నేను మా అమ్మాయితో కలిసి బయటికి వెళ్లినా... మా ఇద్దరికీ సంబంధించి ఏ పోస్ట్ పెట్టినా కొంతమంది చాలా దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. మొగుడుపోయిన తర్వాత విచ్చలవిడిగా తయారైందని కామెంట్స్ చేస్తున్నారు. 
 
భర్తలేని ఒక స్త్రీని పురుషుడు చూసే విధానం, అతని దృష్టికోణం మారుతుంది. ఈ సమాజంలో ఇలాంటి వాళ్లు ఉన్నారు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు స్పందిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన కొత్తలో కాస్త బాధపడేదానిని కానీ, ఆ తర్వాత కామెంట్స్‌ను పట్టించుకోవడం మానేశాను. ఎందుకంటే ఎంతమంది నోళ్లను మూయిస్తాం. మా వాళ్ళకు కూడా ఆ కామెంట్స్ చూడొద్దనే మనవి చేశాను" అని అన్నారు. 
 
ఒకసారి వర్మగారితో కలిసి ఫోటో దిగితే దానిపై ఒకరు ఏకంగా యూట్యూబ్‌లో ఒక ఎపిసోడ్ చేశాడు. అలాంటివారిని చూసినపుడు ఇంతమంది ఖాళీగా ఉంటున్నారా? అని మనసులో అనుకుంటాను. నా వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఈ విధంగానైనా ఓ నలుగురికి భోజనం పెడుతున్నాను అనే అనుకుంటాను" అని చెప్పాను. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments