Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' వంటి కథలు వద్దంటున్న ఎస్ఎస్.రాజమౌళి.. ఎందుకో తెలుసా?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'బాహుబలి 2' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్నారు. బాహుబలి 2 సృష్టిస్తున్న ప్రభంజనధాటికి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అన్ని రికార్డులూ బద్ధలైపోతున్నాయి. ఈనేపథ్యం

Webdunia
బుధవారం, 17 మే 2017 (21:29 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'బాహుబలి 2' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్నారు. బాహుబలి 2 సృష్టిస్తున్న ప్రభంజనధాటికి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అన్ని రికార్డులూ బద్ధలైపోతున్నాయి. ఈనేపథ్యంలో రాజమౌళి తీయనున్న తదుపరి చిత్రంపై అపుడే ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై చర్చోపచర్చలు కూడా సాగుతున్నాయి. 
 
అదేసమయంలో బాహుబలి 3 తీస్తాడనే వార్తలకు ఆయన తండ్రి, బాహుబలి చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫుల్‌స్టాఫ్ పెట్టారు. అంతేనా... బాహుబలి వంటి కథలు వద్దని రాజమౌళి చెప్పారని వెల్లడించారు. 
 
ఇదే అంశంపై విజయేంద్ర ప్రసాద్ తాజాగా స్పందిస్తూ... రాజమౌళి ఎలాంటి కథను కావాలనుకుంటున్నాడో చెప్పారు. తర్వాతి సినిమాకు ఎలాంటి కథ కావాలో రాజమౌళి చెప్పలేదు కానీ... ఎలాంటి కథలు వద్దో మాత్రం చెప్పాడని విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. 
 
తన తదుపరి చిత్రానికి గ్రాఫిక్స్ అవసరం లేని కథ కావాలని విజయేంద్ర ప్రసాద్‌కు జక్కన్న చెప్పాడట. దానికి అనుగుణంగానే కథను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఇక, అంతకుముందే.. తన తదుపరి చిత్రాన్ని వీఎఫ్ఎక్స్ లేకుండా, కమల్ కణ్ణన్ లేకుండా తీస్తానని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments