'ఆర్ఆర్ఆర్' గురించి మొదటిసారి మాట్లాడిన జక్కన్న

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:19 IST)
రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న మరో భారీ బడ్జెట్, భారీ మల్టీస్టారర్ చిత్రం "ఆర్ఆర్ఆర్" ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ ప్రారంభమైన రోజుల్లో కొద్ది రోజులు రామ్ చరణ్ పైన, కొద్ది రోజులు ఎన్‌టీఆర్ పైన కొన్ని సన్నివేసాలను షూట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ కనిపించే సన్నివేసాల చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది.
 
ఇప్పటికే పాత్రకు తగ్గట్లు కనిపించడం కోసం తగిన శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లిన ఎన్‌టీఆర్‌ను తిరిగి రావలసిందిగా రాజమౌళి కబురు పంపడం జరిగింది. ఎన్‌టీఆర్ తిరిగి వచ్చిన వెంటనే వచ్చే గురువారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. హీరోలిద్దరూ కనిపించే సన్నివేసాలను పూర్తి చేసే వరకు ఈ షెడ్యూల్ విరామం లేకుండా సాగుతుందని సమాచారం.
 
ఇలావుండగా, ఈ సినిమా గురించి ఇప్పటి వరకు బయట ఎక్కడా మాట్లాడని రాజమౌళి మొదటిసారి హార్వర్డ్ యూనివర్శిటీలో 'ఇండియా ఎట్ యాన్ ఇన్‌ఫ్లెక్షన్ పాయింట్ థీమ్'లో మాట్లాడుతూ 'ఆర్ఆర్ఆర్' పాన్ ఇండియా సినిమా అని, బాహుబలి సినిమాకు ఏ మాత్రం తీసిపోదు అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో నటించే హీరోయిన్లు ఎవరో వెల్లడించకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.5వేలు ఇస్తామని చెప్పి.. జ్యూస్‌లో మద్యం కలిపారు.. ఆపై సామూహిక అత్యాచారం

అంబులెన్స్‌లో మంటలు... వైద్యుడితో సహా నలుగురి సజీవదహనం

పెళ్లికి ముందు కలిసి ఎంజాయ్ చేయడం... కాదంటే కేసు పెట్టడమా? మద్రాస్ హైకోర్టు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వున్న ఇమ్మడి రవి పేరు.. టికెట్ రేట్లు పెంచేస్తే?

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు : వైకాపా అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments