చెన్నై సముద్రంలో శ్రీదేవి అస్థికలు నిమజ్జనం?

ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆ తర్వాత ఆమె అస్థికలను భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తమిళనాడులోని రామే

Webdunia
సోమవారం, 5 మార్చి 2018 (13:25 IST)
ఇటీవల ప్రమాదవశాత్తు స్నానపుతొట్టిలోపడి ప్రాణాలు కోల్పోయిన హీరోయిన్ శ్రీదేవి. ఆమె అంత్యక్రియలు ముంబైలో జరిగాయి. ఆ తర్వాత ఆమె అస్థికలను భర్త బోనీకపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లు తమిళనాడులోని రామేశ్వరంలో శనివారం కలిపినట్టు వార్తలు వచ్చాయి. 
 
దక్షిణాది హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె అస్థికలను రామేశ్వరం తీరంలో ఉన్న బంగాళాఖాతంలో కలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త బోనీ కపూర్‌తో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరు కుమార్తెలు తమ తల్లిని తలచుకుని విలపించారు. 
 
అయితే, ఈ వార్తలను అనేక మంది కొట్టిపారేస్తున్నారు. ముంబై నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వచ్చిన బోనీ కపూర్ కుటుంబం.. చెన్నై ఈసీఆర్ రోడ్డులో ఉన్న శ్రీదేవికి సొంతమైన ఫామ్‌హౌస్‌లో బసచేశారు. 
 
ఈ ఇంటి వెనుక భాగంలో ఉన్న బంగాళా ఖాతంలోనే ఈ అస్థికలను నిమజ్జనం చేశారని స్థానికులు అంటున్నారు. ఎందుకంటే. వారు నిమజ్జనం చేసిన సమయంలో తీసిన ఫోటో రామేశ్వరంలో తీసినది కాదనీ, శ్రీదేవి నివాసం వెనుకభాగంలో ఉన్న సముద్రం వద్ద తీసిందనే ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Minor girl: తమ్ముడు కిందపడిపోయాడని నమ్మించి.. బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

నాలుగో తరగతి చదివే బాలిక 4వ అంతస్థు నుంచి దూకేసింది.. ఎందుకిలా? (video)

Thalapathy Vijay: మంత్రి నారా లోకేష్‌ను చూసి టీవీకే చీఫ్ విజయ్ నేర్చుకోవాలి..

పొగాకు ఉక్కుపాదం- ధూమపాన నిషేధాన్ని అమలు చేసిన మాల్దీవులు

ASI: డ్రైవర్‌కు కళ్లు కనిపించలేదా? నీళ్ల ట్యాంకర్ ఢీకొని ఏఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments